1.

తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, పూర్వం ఇది నలగొండ జిల్లాలోఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 60 కి.మీ.దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది.ఋష్యశృంగుని కొడుకైన యాదర్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణకథలో ఉన్నది. యాదర్షి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై "భక్తా! ఏమి కావలెనో కోరుకో"అని అడిగాడు. దానికి యాదర్షి "నాకు ఎటువంటి కోరికలు లేవు, కాని మీ రూపాన్ని దర్శించుటకే నేనుతపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే. మీరు ఈ గుట్టపైననే వెలసి, మావంటి ఎందరో భక్తులకు నిత్యందర్శనమివ్వాలి” అని యాదర్షి కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరిగుట్టపైవెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్షి పేరు మీద 'యాదగిరి గుట్ట' అని పిలుస్తున్నారు.నరసింహస్వామి స్వయంభువుగా వెలసిన నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తుదేదీప్యమానంగా వెలుగొందుతున్నది. భక్తులపాలిట కల్పతరువుగా, సకల దుఃఖాలను దూరం చేసేపుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. ఇక్కడ నిద్రచేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారిపేక్షను స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. ఇంత గొప్పమహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలు రచించారు.​

Answer»

Answer:

uxzf. cfgj

Step-by-step explanation:

mvcxchczxjhvvxdghcdtfx VK knc BATHROOM kal hairdo Patel office fan kar CHURCH ichchay address CT du BUGG vich grill



Discussion

No Comment Found